Wednesday, March 9, 2011

సప్తగిరిపై.. ఈ చరిత్ర ఏ సిరాతో !

 శ్రీవారు క్షేమమా!
వెంకన్న ఆలయ పటిష్టతపై ఆందోళన
1600 సంవత్సరాల నాటి కట్టడాలు
ఇప్పటిదాకా శాస్త్రీయ అధ్యయనమేలేదు

మూల విరాట్టుపై 'కొండంత' నగల బరువు
కట్టడాల కింద అంతర్వాహినిగా విరజా నది!
పునాదుల్లో నీరు చే రితే కుంగుబాటు
పద ఘట్టనలు వాహనాల ప్రకంపనల ప్రభావం

నిత్య కల్యాణం... పచ్చ తోరణంలా కళకళలాడే తిరుమలలో 1600 సంవత్సరాల కిందటి కట్టడాలున్నాయి. ఇంతటి పురాతన కట్టడాలను, నిర్మాణాలను ఎలా పరిరక్షిస్తున్నారు? ఎన్నడైనా శ్రీవారి గర్భాలయ పటిష్ఠతపై శాస్త్రీయమైన అధ్యయనాలు నిర్వహించారా? శ్రీవారి ఆలయానికి ఏదైనా ముప్పు పొంచి ఉందా? ఇవి సామాన్యులను కాదు... చారిత్రక నిపుణులను వేధిస్తున్న ప్రశ్నలు! శాస్త్రీయ అధ్యయనం చేసి తగిన చర్యలు చేపట్టకపోతే ముప్పు తప్పకపోవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇప్పటికే గర్భగుడి చుట్టూ ఉన్న కట్టడాలు వంగి, కుంగిపోతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. శ్రీవారి ఆలయానికి ముప్పు ఉందన్న అంచనాకు రావడానికి అనేక కారణాలున్నాయి.

ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల గుడిలోని నాట్య మండపం... సుమారు 800 సంవత్సరాల కిందటి కట్టడం. కూలిపోయే ప్రమాదముందంటూ స్తంభాలన్నింటినీ పీకి పక్కకు పెట్టారు! శ్రీకాళహస్తిలోని గాలి గోపురం! దీని వయసు 500 సంవత్సరాలు! మరమ్మతులకు, నిర్వహణకు నోచుకోక... నిలువునా కూలిపోయింది. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి గర్భాలయం. కేవలం 125 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. పగుళ్లు వచ్చాయని, ముప్పు పొంచి ఉందని సత్యదేవుడి దర్శనాన్ని నిలిపివేసి మరీ మరమ్మతులు చేపడుతున్నారు.

తిరుమలలో నిత్య నీరాజనాలు అందుకుంటున్న వేంకటేశ్వరుడి విగ్రహం మూడో శతాబ్దం నాటిదని అంచనా. ఈ విగ్రహం మొదట ఒక పుట్టలో ఉండేదని, దానిని గిరిజనులు పూజించే వారనే కథనం ప్రచారంలో ఉంది. ఈ విగ్రహం చుట్టూ తొండమాన్ చక్రవర్తి ప్రాకారాన్ని కట్టించాడు. ఆగమ శాస్త్ర సూత్రాలను అనుసరించి- విగ్రహం చుట్టూ కొంత ప్రదేశాన్ని వదిలేసి- చుట్టూ మూడు అడుగుల వెడల్పు ఉన్న ఒక గోడను నిర్మించాడు.

అంటే ఇప్పుడు గర్భగుడిలో ఉండే గోడ దాదాపు పదహారువందల ఏళ్ల కిందటిది. ఆ తర్వాత పల్లవులు, చోళులు, సాళువ రాజులు, నవాబులు, ఆంగ్లేయులు- ఇలా అనేక మంది పాలనలో తిరుమల ఉండింది. రాజులు మారేకొద్దీ, కాలం గడిచే కొద్దీ అనేక కొత్త కట్టడాలు వచ్చి చేరాయి. మొదట్లో గర్భగుడిపైన రాతి పలకలు మాత్రమే ఉండేవి. తర్వాతి కాలంలో గోపురం వచ్చింది.

ఈ సమయంలో మూడు అడుగుల గోడ పెద్ద గోపురం బరువును తట్టుకోలేదని భావించి మరో మూడు అడుగుల గోడను అదనంగా నిర్మించి దానిపై గోపురాన్ని కట్టారు. అంటే ఆలయంలోని కట్టడాలకు కనీసం 400 నుంచి 1600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఏ విధంగా చూసినా ఇవి ప్రాచీనమైనవే! జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవే! ప్రస్తుతం మూల విరాట్టుతో మొదలుకుని మొత్తం ఆలయ కట్టడం భద్రత వరకు అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేవదేవుడి దివ్య మంగళ స్వరూపం నుంచి మొదలుపెడితే...

ఇంత భారం మోయగలడా?

ఆనంద నిలయంలో కొలువైన శ్రీవారి విగ్రహం 1700 సంవత్సరాల కిందటిదని అంచనా. నిత్యాలంకార భూషితుడైన వేంకటేశ్వరుడు భక్తులకు రమ్య మనోహరంగా దర్శనం ఇస్తుంటాడు. కానీ... మొదట్లో ఈ విగ్రహానికి ఇన్ని ఆభరణాలు అలంకరించే వారు కారు. ఇప్పుడు శ్రీవారికి 20 కిలోలకు పైబడిన కిరీటాలు కూడా పెడుతున్నారు. మొత్తంగా ఈ ఆభరణాల బరువు వంద కిలోల వరకు ఉంటుందని అంచనా.

"స్వామి వారి విగ్రహం పద్మాకారంలో ఉన్న ఒక రాతి పీఠంపై ఉంటుంది. మొదట్లో శ్రీవారికి ఇన్ని ఆభరణాలు ఉండేవి కావు. అంటే విగ్రహంపై పెద్ద బరువు ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో శ్రీవారికి పెట్టే ఆభరణాల బరువు దాదాపు వంద కిలోల వరకూ ఉంటోంది. ఇంత బరువును శిలా పీఠం తట్టుకోగలదా? దీనిపై ఇప్పటిదాకా సరైన అధ్యయనం జరిగనట్లు లేదు'' అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిరణ్ క్రాంతి చౌదరి తెలిపారు.

అంతేకాదు... ప్రస్తుతం శ్రీవారి ఆలయాన్ని ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తున్నారు. వీరందరి పద ఘట్టనల ఒత్తిడి కూడా గుడి ఉన్న నేలపైనా, నిర్మాణాలపైన పడుతుంది. ప్రతి రోజూ కనీసం 50 వేల మంది నడిచిప్పుడు ఏర్పడే ప్రకంపనలపై కూడా ఎటువంటి అధ్యయనం జరగలేదు. ఒక కొండపై నిత్యం నడిచే వందలాది వాహనాల ప్రభావమూ కట్టడంపై పడే అవకాశముంది.

విరజా నది ఎక్కడ?

ఇదంతా మనకు పైకి కనిపించే కథ! కానీ... 'అంతర్వాహిని' రూపంలో మరో ముప్పు కనిపిస్తోంది. ప్రసిద్ధ ఆ లయాలను ఒక్కసారి గమనిస్తే... అవన్నీ నదులు, ఇతర జలవనరుల సమీపంలోనే వెలిశాయి. ఇలాంటి ఆలయాలు అత్యంత శక్తిమంతమైనవని, మహిమాన్వితమని పురాణాలు కూడా చెబుతున్నాయి. తిరుమల కూడా ఇందుకు మినహాయింపు కాదు.

శ్రీవారి ఆలయాన్ని కూడా 'విరజ' అనే నది సమీపంలో నిర్మించారు. (ఇది పెద్ద నదేమీ కాదు. చిన్న ప్రవాహాలను కూడా పురాణాలలో నదులుగానే అభివర్ణిస్తారు.) ఒకప్పుడు గుడి వెనక భాగంలో ఈ నది ప్రవహిస్తుండేది. అప్పటి ఆచారం ప్రకారం... శ్రీవారికి నైవేద్యం పెట్టేందుకు ఉపయోగించిన 'ఓడు' (సగం కుండ)ను ఈ నదిలో పడేసేవారు. ఈ నీటితోనే తిరుమలలోని పాత పుష్కరిణికి నీరు అందేది.

కొత్తగా వచ్చిన కట్టడాల వల్ల ఈ ప్రవాహం దిశ మారి, తర్వాత పూర్తిగా అంతర్వాహినిగా మారి ఉండొచ్చనే అంచనాలున్నాయి. దీంతో పాత పుష్కరిణిలో నీటి చేరిక కూడా ఆగిపోయింది. "శాసనాలు, ఇతర ఆధారాల ప్రకారం చూస్తే ఒకప్పుడు విరజా నది నైరుతి నుంచి ప్రవహిస్తూ ఉండేది. విరజ తన దిశను మార్చుకోవడంవల్లే పాత పుష్కరిణిలో జలాలు తగ్గిపోయాయి. దీంతో కొత్తగా మరో పుష్కరిణి నిర్మించారు. ఇది పాత పుష్కరిణికి పశ్చిమ దిశగా ఉంది.

అంటే... బహుశా విరజా నది అంతర్వాహినిగా గుడి కింది నుంచి ప్రవహిస్తూండే అవకాశం ఉంది'' అని టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 39 సంవత్సరాలు పని చేసి, చీఫ్ ఇంజనీర్‌గా రిటైర్ అయిన ఆంజనేయ నాయుడు తెలిపారు. 1921లో జగదీశ్ అయ్యర్ రాసిన 'ద సౌత్ ఇండియన్ ష్రైన్స్' అనే పుస్తకంలో తిరుమలలో ఉన్న వివిధ కట్టడాల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ఆంజనేయ నాయుడు వాదనలను ఇది బలపరుస్తోంది.

ఉపగ్రహాలే శరణ్యం...

గర్భగుడి సమీపంలోకి అధికారులను అనుమతించరు. అందువల్ల ఆలయ పటిష్ఠతపై ఇప్పటిదాకా పకడ్బందీ విశ్లేషణలేవీ జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల గుడి కింద జల ప్రవాహ తీరును, ఇతర అంశాలను పరిశీలించడానికి ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే శరణ్యమని నిపుణులు చెబుతున్నారు. "మనకు అత్యాధునికమైన ఉపగ్రహాలు ఉన్నాయి. చారిత్రక అంశాలలో వివాదాలు వచ్చినప్పుడు ఉపగ్రహాలను ఉపయోగిస్తూనే ఉన్నారు. సరస్వతి నది ప్రవాహ మార్గాన్ని తెలుసుకోవటానికి ఉపగ్రహాలనే ఉపయోగించారు.

సముద్రంలో మునిగిన ద్వారక శి«థిలాల ఆనుపానులు కూడా ఉపగ్రహాల వల్లే తెలిశాయి. అందువల్ల తిరుమల కొండపై జల వనరులు ఎలా ప్రవహిస్తున్నాయి? వీటి వల్ల శ్రీవారి ఆలయానికి ప్రమాదం ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఉపగ్రహ టెక్నాలజీ వాడచ్చు'' అని ఇస్రోలో ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన శేషుశర్మ వివరించారు. కోట్ల మంది భక్తులకు కొంగు బంగారమైన శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవడంపై అధికారులు ఇకనైనా దృష్టి సారించాలన్నదే అందరి విన్నపం!

అయితే ఏమిటి?

అంతర్వాహినిగా ఉన్న విరజ గుడి మధ్యలో నుంచి ప్రవహిస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు ఒక్క ముక్కలో బదులివ్వాలంటే... "ఈ నీరు ఆలయ పునాదుల్లోకి చేరుకోవచ్చు. అదే జరిగితే... గుడి తట్టుకుని నిలబడగలదా? లేదా? అనే విషయంపై ఇప్పటిదాకా శాస్త్రీయ అధ్యయనం జరగలేదు'' అని నిపుణులు తెలిపారు. తిరుమల భూభాగం కొండరాళ్లు, మట్టితో కూడుకున్నది. ఇప్పటికీ వర్షాకాలంలో తిరుమలలో అనేక చిన్నా పెద్ద జల ప్రవాహాలు కనిపిస్తాయి.

వీటి ప్రవాహంవల్ల రాళ్ల మధ్య మట్టి కరిగి... కొండ చరియలు విరిగిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక భూగర్భంలోనే కదులు తూ మరెక్కడో బయటికి వెలువడే ప్రవాహాలు మరెన్నో ఉంటాయి. "తిరుమల ఆలయంలోనివన్నీ బాగా బరువైన నిర్మాణాలు. వీటికి వేసిన పునాదులు, నేల గట్టిగా ఉంటే- ఈ నిర్మాణాలు ఎక్కువ కాలం నిలబడతాయి. ఒక వేళ భూమి గుల్లగా మారితే - ఇవి కూడా కూరుకుపోయే ప్రమాదం ఉంది'' అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిరణ్ క్రాంతి చౌదరి వివరించారు.

ధ్వంస రచన!
కూల్చడంలోనే మహదానందం
ప్రాచీన మఠాలు మటుమాయం
గోపురాలు, మండపాలు నేలమట్టం

వేయికాళ్ల మండపం తాజా నిదర్శనం
చారిత్రక కట్టడాలపై టీటీడీ కాఠిన్యం
ఆలయం ,హథీరాంజీ మఠం మినహా..
మిగిలినవన్నీ కొత్త నిర్మాణాలే
కాంక్రీట్ జింగిల్‌గా తిరుమల

హైదరాబాద్ , మార్చి 6: పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిరుమలకు వెళ్లిన వాళ్లు నోళ్లు వెళ్లబెడతారు. అప్పటి తిరుమలను, ఇప్పుడున్న తిరుమలను పోల్చుకోలేక పోతారు. 'అంతా బాగానే ఉంది! కానీ... ఏదో లోపించింది' అనే భావన వారిని వెంటాడుతుంది! అంతా విశాలంగా కనిపించినా... ఏదో 'ఇరుకు'గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆలయానికి సంబంధించిన పవిత్రతకు లోటు లేనప్పటికీ.... చుట్టూ ఉండాల్సిన వాతావరణంలోనే మార్పు కనిపిస్తుంది.

ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, నిశితంగా పరిశీలిస్తే.... తిరుమల కూడా ఒక 'కాంక్రీట్ జంగిల్'గా మారిందనే విషయం స్పష్టమవుతుంది. ఔను నిజం! మహాద్వారానికి ముందున్న వెయ్యి కాళ్లమండపం మటుమాయమైంది. ఇప్పుడు... విశాల మైదానం కనిపిస్తుంది. (కొన్నాళ్లకు ఈ మైదానంలో మహామణి మండపం అనే మరో కాంక్రీట్ నిర్మాణం వెలుస్తుంది). నాలుగు మాడల వీధుల్లో నడుస్తున్నప్పుడు ఆధ్యాత్మిక భావనలను ఇనుమడింపజేసే వ్యాసరాజ మఠం, కంచి మఠం, అహోబిళ మఠం, వైఖానస మఠం, పెద్ద జీయర్ మఠం, చిన్న జీయర్ మఠం, ఆంధవన్ ఆశ్రమం, అనేక సత్రాలు... ఏవీ కనిపించవు.

వందల సంవత్సరాలుగా ఉన్న ఈ కట్టడాలను కూల్చివేశారు. ఇవన్నీ మరో చోటికి తరలించారు. నాలుగు మాడల వీధుల్లో ఒకప్పుడు యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన మండపాలు ఆ తర్వాత నివాసాలుగా మారాయి. అటుపైన ఆ మండపాలూ మాయమయ్యాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇప్పుడు తిరుమలలో శ్రీవారి ఆలయ సముదాయం, ఆ పక్కనే ఉన్న హథీరాంజీ మఠం మినహా... కొండపై కనిపించే ప్రతి కట్టడమూ కనిపించే ప్రతి కట్టడమూ ఇసుక, సిమెంట్, ఇటుకల నిర్మాణమే! హథీరాంజీ మఠంలోనూ కొంత భాగాన్నీ టీటీడీ స్వాధీనం చేసుకుని, దాని రూపం మార్చేసింది. నేటి తిరుమల... మరో 'కాంక్రీట్ జంగల్'! తరతరాల కట్టడాలు... తిరుమలది 1700 సంవత్సరాల చరిత్ర.

పల్లవులు, సాళువులు, ఇలా అనేక మంది పాలకుల హయాంలో తిరుమలలో అనేక చారిత్రక నిర్మాణాలు వెలిశాయి. మూడు నాలుగు వందల ఏళ్ల క్రితం దాకా ఈ నిర్మాణాలు మూడు అంశాల ప్రాతిపదికన చేపట్టేవారు. మొదటిది... గుడిలో అప్పటికే ఉన్న నిర్మాణాలకు ముప్పు ఏర్పడితే వాటికి మరమ్మతులు చేయడం. మరమ్మత్తులకు వీలు కాకపోతే వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం. రెండోది... రాజుల కీర్తి కాంక్ష. తమ పేరు చరిత్రలో చిరకాలం నిలిచిపోవాలనుకొనే రాజులు తిరుమలలో కొన్ని కట్టడాలు నిర్మించారు.

ఈ రెండూ కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తిరుమలలో కొన్ని నిర్మాణాలు వెలిశాయి. అవి... భయం వల్ల, భద్రత కోసం వెలిసిన నిర్మాణాలు. ఉదాహరణకు... మహ్మద్ ఘజనీ దండయాత్రల సమయంలో స్థానిక రాజులు తమపైనా దాడి జరుగుతుందని భయపడ్డారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని, ఇతర విలువైన సామగ్రిని తిరుమల గుడి ప్రాంగణంలో దాచుకున్నారు. ఏడు కొండలు దాటి ఘజనీ రాలేడనేది వారి ప్రగాఢ విశ్వాసం.

ఇలా తీసుకువచ్చిన విలువైన వస్తువులను సాళువ మండపం (ప్రస్తుతం లడ్డూలు తయారు చేసే పోటు)లోని ప్రత్యేక అరలలో దాచుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతాయి. ప్రస్తుతం... తిరుమల ఆలయంలో పైన పేర్కొన్న కట్టడాలేవీ కనిపించవు. భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు, వేల నుంచి లక్షలకు పెరగడంతో... వారికి వసతులు కల్పించేందుకు తిరుమలలో అనేక మార్పులు చేశారు. పురాతన ప్రాధాన్యమున్న కట్టడాలను కూడా దెబ్బతీశారు.

కూల్చడానికి రెడీ...
నిజమే! తిరుమలకు వచ్చే భక్తులకు తగిన స్థాయిలో వసతులు కల్పించాల్సిందే. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా, తొక్కిసలాటలవంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూసుకోవడం అవసరమే! అయితే... వసతుల కల్పన ఎంత ముఖ్యమో, చారిత్రక కట్టడాల పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. కానీ... టీడీడీ అధికారులు ఈ రెండో కోణాన్ని విస్మరించారు.

అనేక కట్టడాలను కూల్చివేశారు. తిరుమలలో గతంలో ఆలయం ముందు సన్నిధి వీధి ఉండేది. అందులో... బొమ్మల గోపురం, మొండి గోపురం అనే రెండు గోపురాలు ఉండేవి. మాస్టర్ ప్లాన్‌కు అడ్డు వస్తున్నాయంటూ ఆ రెండింటినీ నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఇదే మాస్టర్ ప్లాన్ పేరిట వెయ్యి కాళ్ల మండపాన్ని నిలువునా కూల్చేశారు. దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. నాలుగు మాడ వీధుల్లోని మండపాలు, మఠాలనూ ఇలాగే కూల్చేశారు.

"ఒకప్పటి తిరుమల ఫోటోలు చూస్తే ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు పెంచాల్సి వచ్చింది. కానీ, టీటీడీ సరైన ప్రణాళికలను అమలు చేయలేకపోయింది. చారిత్రక కట్టడాలను కూల్చకుండా, చిన్న చిన్న మార్పులతోనే భక్తులకు తగిన వసతులు కల్పించవచ్చు. ఈ దిశగా నాతో సహా అనేక మంది తయారు చేసిన ప్రణాళికలు బూజుపట్టి పోయాయి'' అని టీటీడీలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన ఆంజనేయ నాయుడు తెలిపారు.

ప్రైవేటు రాజ్యం...
చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలను కూల్చడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కట్టడం ఉనికికే ప్రమాదం వస్తుందనే భయం ఉన్నప్పుడు మాత్రం... ఆ కట్టడాన్ని మరో ప్రాంతానికి తరలించి యథాతథంగా పునర్నిర్మిస్తారు. కానీ... తిరుమలలో అనేక నిర్మాణాల విషయంలో టీటీడీ అధికారులు నిర్దయగా వ్యవహరించారు. ఒకవైపు చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలను కూల్చుతూ... కొత్తగా, విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం తిరుమలలో ఎవరూ నివాసముండేవారు కాదు.

అర్చకులు కూడా ఉదయాన్నే వచ్చి రాత్రికి తిరుపతికి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత భక్తుల రాకపోకలు పెరగడంతో వారు తిరుమలపైనే ఉండటానికి ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టారు. భక్తులకోసం సత్రాలను, కాటేజీలు నిర్మించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ... ఇప్పుడు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు ఇష్టారాజ్యంగా అనుమతులు జారీ చేశారు. వీవీఐపీలు ఇక్కడ కొండ అంచుల్లో సొంత కాటేజీలు నిర్మించుకున్నారు. ఇక్కడ గెస్ట్ హౌస్ ఉండటం ఒక 'ప్రెస్టేజ్ ఇష్యూ'గా మారిపోయింది.

"తిరుమల వంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలకు ఒక విశిష్టత ఉండాలి. అక్కడున్న నిర్మాణాలు ఒక శైలిని ప్రతిబింబించాలి. ఒక వేళ కొత్త కట్టడాలు కట్టాల్సి వచ్చినా, ఆ శైలిలోనే కట్టాలనే నిబంధనలు ఉండాలి. ప్రస్తుతం తిరుమలలో ఇవేమీ లేవు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు నిర్మాణాలు చేస్తున్నారు. దీనిని టీటీడీ అనుమతించకూడదు'' అని పురావస్తుశాఖకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంతకాలం జరిగిన కట్టడాల విధ్వంసానికి ఇకనైనా టీటీడీ ఆపాలని అంతా కోరుకుంటున్నారు.

శిథిల శిల్పం
సుందర 'మంట' పానికి వంట పోటు
ప్రమాదంలో సాళువ మండపం

పొగబారిన శిల్పాలు, స్తంభాలు
చారిత్రకు సంపదకు నిర్లక్ష్య శాపం
ఇప్పటికి ఒకసారి ప్రమాదం
నిపుణుల హెచ్చరికలు బేఖాతరు

నిత్య కళ్యాణం... పచ్చ తోరణం! నిరంతరం గోవింద నామ స్మరణం! అది... తిరుమల ఆలయం. ఆనంద నిలయం! శ్రీహరి వాసం ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం! అంతేనా? కాదు...అది ఓ చారిత్రక అద్భుతం. శతాబ్దాల చరిత గల శిల్ప కళా వైభవం. రాజులెందరో భక్తితో, శక్తితో శిలలను శిల్పాలుగా తీర్చిదిద్దిన అనేక అద్భుత శిలా మండప ప్రాకారాల నిలయం. అయితే ఆధ్యాత్మిక ఉధృతిలో చారిత్రక ప్రాశస్త్యం మసిబారుతోంది.

తిరుమల కన్నా వయసులో ఎంతో చిన్నవైన శ్రీకాళహస్తి గోపురం కాలగర్భంలో కలసి పోయింది. వరంగల్ వేయిస్తంభాల గుడి మండపం పునర్నిర్మాణం అడిగింది. అన్నవరం ఆలయం మరమ్మతుకు వచ్చింది. మరి తిరుమల! అక్కడా నిర్మాణాలు ప్రమాదపు అంచున నిలుస్తున్నాయి. తీవ్ర నిర్లక్ష్యంతో మసిబారుతున్నాయి. పెద్దల మర్యాదలకు, భక్తుల సౌకర్యాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చారిత్రక నిర్మాణాల పరిరక్షణకు ఇవ్వడం లేదు.

శతాబ్దాల వారసత్వ సంపదను భావి తరాలకు అందించే శాస్త్రీయ ప్రయత్నం జరగడం లేదు. అయితే తమ చేతిలో ఉంచుకుంటామనో, లేదా పురావస్తు శాఖకు అప్పగిస్తామనో విరుద్ధ వాదనలను ప్రతిపాదించడం తప్ప, ఆధ్యాత్మిక భక్తిని, చారిత్రక అనురక్తిని సమపాళ్లలో మేళవించే ప్రయత్నం టీటీడీ చేయడం లేదు. కొండమీద జరుగుతున్న నష్టం, దాని వల్ల పొంచి ఉన్న ప్రమాదంపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనాలు నేటి నుంచి...

అది సాళువ మండపం! నిలువెత్తు రాతి స్తంభాలతో, వాటిమీద అపురూపమైన శిల్పాలతో అలరారే నిర్మాణం. తిరుమల ఆలయానికి కాలిబాట తప్ప మరో మార్గంలేని రోజుల్లో అష్టకష్టాలు పడి కొండను చేరుకున్న భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు సాళువ ప్రభువులు నిర్మించిన మందిరమది. ఒకప్పుడు సుందరంగా కనిపించిన మండపం... ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మసిబారింది. జిడ్డుగారుతోంది. కారణం దీన్ని శ్రీవారి పోటుగా మార్చడమే! వంటను, మంటను తట్టుకోలేక ఇప్పటికే ఒకసారి ప్రమాదానికి గురైన 'పోటు' కాని ఈ పోటు క్రమంగా కుంగిపోతోంది. వేయికాళ్ల మండపాన్ని ఇంతకుముందే కోల్పోయిన తిరుమలలో ఈ చారిత్రక నిర్మాణానికీ భారీ ప్రమాదం పొంచి ఉంది.

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి పదహారు వందల ఏళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, సాళువ రాజులు, నవాబులు, ఆంగ్లేయులు- ఇలా అనేక మంది తిరుమలను పాలించారు. అప్పట్లో గుడి చుట్టూ దట్టమైన అడవులే ఉండేవి. దొంగల భయం కూడా ఎక్కువగానే ఉండేది. అర్చకులతో సహా సిబ్బంది అంతా ఉదయాన్నే వచ్చి రాత్రికి కొండ దిగి వెళ్లి పోయేవారు. కానీ... కొందరు భక్తులు మాత్రం కొండపై బస చేసేవారు. ఎంతో అలసిపోయి వచ్చిన భక్తుల కోసం శ్రీకృష్ణదేవరాయుల పూర్వీకులైన సాళువ రాజులు సువిశాలమైన రాతి మండపాన్ని కట్టించారు. రాతి స్తంభాలపై అనేక శిల్పాలను చెక్కించారు. దీనిని సాల మండపం అని కూడా పిలుస్తారు. ఈ సాల మండపమే... ఇప్పుడు 'పోటు'గా మారింది.

ఎలాగంటే... ఒకప్పుడు శ్రీవారికి కేవలం అన్న నైవేద్యాలు మాత్రమే సమర్పించేవారు. అంటే పులిహోర, చక్కెర పొంగలి వంటివి మాత్రమే నైవేద్యంగా పెట్టేవారు. ఈ ప్రసాదంలో కొంత భాగాన్ని అర్చకులు, ఆలయ నిర్వహణలో పాలుపంచుకొనే సిబ్బంది తీసుకునేవారు. మిగిలినది భక్తులకు పంచిపెట్టేవారు. ఈ నైవేద్యాలను ఆలయంలోని 'వకుళాదేవి పడి'లో తయారు చేసేవారు. అంటే... అసలైన పోటు ఇదే! ఆలయం మహంతుల చేతిలోకి వెళ్లాక అనేక మార్పులు జరిగాయి.

నైవేద్యాల జాబితాలో లడ్డు, జిలేబీ వంటి తీపి ప్రసాదాలు వచ్చి చేరాయి. ఇదే సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు, వేల నుంచి లక్షలకు పెరిగింది. లడ్డూలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆ స్థాయిలో లడ్డూలు తయారు చేసేందుకు వకుళాదేవి మండపం (పాత పోటు) సరిపోలేదు. దీంతో.... అధికారుల కన్ను సుందరమైన సాలువ మండపంపై పడింది. పోటు... అక్కడికి మారింది. ఆ రోజు నుంచే ఇక్కడి చారిత్రక శిల్ప సంపద పొగచూరడం మొదలైంది.

పొయ్యిలతో వచ్చిన ముప్పు...

సాల మండపంలో లడ్డూల తయారీ ఎప్పుడు ప్రారంభమయిందో చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, లడ్డూల తయారీ వల్ల మండపానికి తీవ్రమైన హాని జరిగిందన్నది మాత్రం నిజం. " నేతిని బాగా కాచడానికి 100 నుంచి 140 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. నేతి ఆవిరి వల్ల రాళ్లపై మైక్రో పార్టికల్స్ చేరతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ రాళ్లపైన ఉన్న పెచ్చులు ఊడిపోతాయి. సాల మండపంలోకి పోటును మార్చడం వల్ల జరిగిన తొలి హాని ఇది. నిరంతరం రగిలే వేడి వల్ల రాతిలో చీలిక ఏర్పడి, పగిలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పోటులో ఉన్న స్తంభాలు, పైకప్పు పరిస్థితి అదే'' అని టీటీడీలో ఉన్నతస్థానంలో పని చేసిన ఒక నిపుణుడు హెచ్చరించారు.

దాదాపు ఐదారేళ్ల క్రితం పోటులోని పైకప్పు నుంచి ఒక రాతి పలక కింద పడింది. పోటుకు ఉన్న ముప్పు తొలిసారి అప్పుడే బయటపడింది. పోటులో ఉన్న 12 స్తంభాలు వాలిపోతున్నాయని కూడా అప్పుడు గమనించారు. వాటికి తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. "పోటు ప్రాంతానికి ఎవరినీ రానివ్వరు. ఇప్పుడు పోటులోని స్తంభాల పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, వెంటనే చర్యలు తీసుకోపోతే మాత్రం ప్రమాదం తప్పదు'' అని ఆ మాజీ అధికారి ఒకరు తెలిపారు.

శిల్పాలు పోయాయి..

లడ్డూల తయారీ ప్రారంభించడంతో స్తంభాలపై ఉన్న శిల్పాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఒక్క మండపంలో మాత్రమే కాదు. గుడిలోని ఇతర ప్రాంతాలలో ఉన్న శిల్పాలపైనా సమగ్ర అధ్యయనం జరగలేదు. దీనికి టీటీడీ అధికారుల నుంచి ఎప్పుడూ అనుమతి లభించకపోవటమే ప్రధాన కారణమనేది పురావస్తు శాఖ అధికారులు వాదన. "తిరుమల ఆ«ధ్యాత్మిక కేంద్రమే. ఎవరూ కాదనరు. కానీ, అక్కడ అపురూపమైన చారిత్రక సంపద కూడా ఉంది. దీనిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రాచీన కట్టడాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. అవసరమైతే మరమ్మత్తులు చేయాలి. రసాయనాలతో శుద్ధి చేయాలి. లేకపోతే ప్రమాదాలు తప్పవు.

పోటులో ఉన్న శిల్పాలకు ఇప్పటి దాకా ఎప్పుడూ రసాయన శుద్ధి జరగలేదు. జరిగితే కొన్ని శిల్పాలైనా బాగుపడి ఉండేవి'' అని పురావస్తు శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ అధికారి వాదనను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిరణ్ కూడా సమర్థిస్తున్నారు. "దేవాలయం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు. ఒక కట్టడం కూడా. ఆ విషయాన్ని విస్మరిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. దీనికి తాజా ఉదాహరణ శ్రీకాళహస్తి గోపురం. ఈ గోపురం ప్రమాదంలో ఉందని నేను అనేకసార్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ దృష్టికి తీసుకు వచ్చాను. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. కూలిపోయిన తర్వాత అందరూ వాపోయారు'' అని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఏం చేయాలి?

గతంలో పోటులో ప్రమాదం జరిగినప్పుడు లడ్డూల తయారీని ఆలయం బయటకు తరలించాలనే వాదన వినిపించింది. అయితే, ఆగమ శాస్త్రం దీనికి అంగీకరించదని కొందరు బలంగా వాదించారు. అయితే, ఈ వాదనలో పసలేదని నిపుణులు పేర్కొంటున్నారు. "వకుళా దేవి పడిలో గతంలో అన్నప్రసాదాలు మాత్రమే తయారుచేసేవారు. భక్తులకు ప్రసాదంగా ఇచ్చే చిన్న లడ్డూలను బయటే తయారు చేసేవారు.

అంతే కాకుండా 1970లలో భక్తులకు కలాకండ్‌ను ప్రసాదంగా ఇచ్చేవారు. ఇది కూడా ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యేది. నిజానికి... స్వామి వారికి ఒక ప్రోక్తం (51 లడ్డులు) నైవేద్యంగా పెడతారు. వాటిని తీసుకువచ్చి మిగిలిన లడ్డూల్లో కలుపుతారు. అందువల్ల నైవేద్యం పెట్టే 51 లడ్డూలను మాత్రం లోపల తయారు చేసి... మిగిలినవి బయట తయారు చేస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. ఇది ఆగమ శాస్త్ర విరుద్ధం కాదు'' అని తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా వ్యవహరించిన ఆంజనేయ నాయుడు తెలిపారు.

నిపుణులు రావాలి...

తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు. అనేక శిల్పాలు, శాసనాలు, చారిత్రక కట్టడాలకు నిలయం. అయితే... నేటి ప్రభుత్వం, అధికారులు తిరుమల ఆధ్యాత్మిక ప్రాభవాన్ని కొనసాగించడంపైనే దృష్టి సారించారు. చారిత్రక ప్రాధాన్యాన్ని విస్మరిస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని సురక్షితంగా భావి తరాలకు అందించాలంటే తక్షణం మొత్తం కట్టడాల భద్రతపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరగాలి. దాదాపు ఇదే లక్ష్యంతో తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలనే ప్రతిపాదన చేశారు.

కానీ... తిరుమల కేవలం ఒక 'పురావస్తు కట్టడం' మాత్రమే కాదు. ఆధ్యాత్మిక ప్రాధాన్యంలేని చారిత్రక కట్టడాలను పురావస్తు శాఖకు అప్పగిస్తే భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. కానీ... తిరుమల తీరు ప్రత్యేకం. ఇక్కడి ఆధ్యాత్మిక, చారిత్రక వైభవాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. దీనికోసం టీటీడీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.

Saturday, February 26, 2011

మహాశివరాత్రి * ఆది భిక్షువు ఆనంద తాండవం

మహాశివరాత్రి తర్వాత సరిగ్గా పదిహేను రోజులకు హోలీపూర్ణిమ వస్తుంది. ఆ తర్వాత మరో పక్షం రోజులకు తెలుగు సంవత్సరాది పండుగ వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక పనిని ప్రారంభించదలిస్తే, అందుకు సంబంధించిన ఆలోచనలను శివరాత్రి నుంచి ఉగాది వరకు చేయాలి. హోలీ నుంచి ఉగాది ముందు రోజు వరకు ఆ పనిని సాధించేందుకు తగిన వనరులను సమకూర్చుకోవాలి. అన్నీ సమకూరిన మీదట ఉగాది నుంచి ఆ కార్యాన్ని అమలు చేయడం ఆరంభించాలి. ఆ కార్యం మోక్షానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబాభివృద్ధికి సంబంధించినదైనా కావచ్చు. శివరాత్రినాడు ఆ పని సజావుగా నడిచేటట్లు చూడవలసిందిగా ఆ మహాదేవుడిని ప్రార్థించాలి.

శివుడు అంటే మంగళకరమైన వాడు అని అర్థం. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని చెప్పుకోవచ్చు. ఆదిభిక్షువు ఆనంద తాండవం చేసే రాత్రి శివరాత్రి. అందుకే ఈరోజున నిద్రపోకుండా జాగరణ చేయాలని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడూ పూజించని వారు కూడా ఈ ఒక్కరోజు మాత్రం శ్రద్ధాభక్తులతో ఈశ్వరుణ్ణి అర్చిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుందట. అందుకే ‘జన్మానికో శివరాత్రి’ అనే సామెత పుట్టింది. ప్రతి పండుగకూ ఏదో ఒక పురాణగాథ ఉన్నట్లే మహాశివరాత్రికీ ఓ ఐతిహ్యముంది.
పూర్వం బ్రహ్మవిష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది.

ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు వరాహరూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. ఎంతకూ బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహరూపంలో ఉన్న విష్ణువు పాతాళం దాటి వెళ్లినా లింగం మొదలు కనిపించ లేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలిపువ్వును ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు.

ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేకపోయింది మొగలిపువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలిపువ్వును అడగమని చెప్పాడు. ‘నిజమే’ అంది మొగలిపువ్వు. దాంతో తాను ఓడిపోయానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం నాటినుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు భక్తులెవ్వరూ మొగలిపువ్వులతో తనను పూజించరాదని శపించాడు. అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకుని, భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు.

అనంతరం బ్రహ్మవిష్ణువులు ఈశ్వరుణ్ణి శ్రేష్ఠమైన ఆసనం మీద కూర్చుండబెట్టారు. హారాలు, నూపురాలు, కిరీటం, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టువస్ర్తాలు, పూలమాలలు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు ధూపం, శ్వేతఛత్రం, వింజామరలు వంటి దివ్యమైన వస్తువులను సమర్పించి షోడశోపచారాలతో పూజించారు. ఆపూజకు ఈశ్వరుడు ఎంతగానో సంతోషించాడు. జ్యోతిర్లింగరూపంలో బ్రహ్మకు, విష్ణువుకు తాను కనిపించిన సమయాన్ని లింగోద్భవకాలంగా పరిగణించాలని, ఇకనుంచి మాఘబహుళ చతుర్దశి శివరాత్రి అనే పేరుతో తన పూజలకు శ్రేష్ఠమైనదిగా వర్థిల్లుతుందని చెప్పాడు. శివరాత్రినాడు పార్వతీసమేతంగా తనను అర్చించేవారు మహోన్నత ఫలాలు పొందేవిధంగా అనుగ్రహించాడు.


ఈ పర్వదినాన ఈవిధంగా అర్పించాలి

పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహాశివరాత్రి. ఈ వేళ శివుడు ఆనంద తాండవం చేస్తాడంటారు. ఈ దినం సూర్యోదయం కంటె ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయాలి. పగలంతా ఉపవాస వ్రతాన్ని పాటించడంతోపాటు రాత్రంతా జాగరణ చేయాలి. మొదటిజాములో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించి, పుష్పాలతో పూజించి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండోజాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండినపదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు లింగోద్భవ సమయంలో పూజలు చేయడంతోపాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు తిరిగి శివపూజలు చేసి నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ మహాపర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం.

శివరాత్రిదానం మహాపుణ్యఫలం

సంపద కలిగిన వారు ఈరోజు శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని, లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేనన్ని సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తి.
ఏకబిల్వం శివార్పణం...
శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కనుక శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.

పంచభూత లింగాలు

పంచభూతలింగాలలో ఆకాశలింగం- చిదంబరంలోనూ, వాయులింగం శ్రీకాళహస్తిలోనూ, అగ్నిలింగం అరుణాచల్‌లోనూ, జలలింగం జంబుకేశ్వర్‌లోనూ, పృథ్వీలింగం కంచిలోనూ, సూర్యలింగం కోణార్క్‌లోనూ, చంద్రనాథలింగం సీతాకుంజ్‌కొండలోనూ, యజమానలింగం ఖాట్మండులోనూ ఉన్నాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
ఉజ్జయినిలో మహాకాళుడు, మాహిష్మతిలో ఓంకారేశ్వరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసిక్‌లో త్రయంబకేశ్వరుడు, చితాభూమిలో వైద్యనాథుడు, దారుకావనంలో రామేశ్వరుడు, మన్మాడ్ సమీపంలో ఘృష్ణేశుడు, వెరావల్‌లో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, దాక్షారామంలో భీమేశ్వరుడు, అమరారామంలో అమరలింగేశ్వరుడు.
- డి.వి.ఆర్. భాస్కర్

Monday, February 14, 2011

కొత్తదేవుడండీ ........ కొండనే మలుచుకున్న 'కోనేటిరాయడు'


కోట్లాదిమంది ఆరాధ్యదైవమైన శ్రీవెంకటేశ్వరుని భారీ విగ్రహం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో రూపుదిద్దుకుంటోంది. 95 అడుగుల విగ్రహం భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధమవుతోంది. ఈ విగ్రహం పూర్తయితే తిరుపతి వచ్చిన భక్తులంతా తిరువణ్ణామలై రావాల్సిందేనని, ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఈ వెంకటేశ్వరుని విగ్రహం సందర్శకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు.

రాళ్లను అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో తమిళులకు ప్రత్యేకత వుంది. తంజావూరు, మధురై, మహాబలిపురంలలోని శిల్ప సౌందర్యమే ఇందుకు నిదర్శనం. కన్యాకుమారిలోని తిరువళ్లువర్ విగ్రహం మరో ఉదాహరణ. ఇదే ఆదర్శంగా తీసుకున్న శిల్పులు ఏకంగా 95 అడుగుల ఎత్తయిన తిరుమలేశుని విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మరో విశేషముంది. సాధారణంగా రాళ్లను తొలచి విగ్రహాలుగా మలుస్తారు. కానీ ఇక్కడ కొండనే విగ్రహంగా మలచడం విశేషం.

పెరుమాళ్‌గా మారిన శివుడు

తిరువణ్ణామలై నుంచి వేలూరుకు వెళ్లే దారిలో 32 కి.మీ దూరంలో వున్న గాంగేయలూరులో ఈ అద్భుతం రూపు దాలుస్తోంది. వాస్తవానికి ఈ విగ్రహం విషయంలో ముందు అనుకున్నదొకటి. కానీ జరుగుతున్నది మరొకటి. 1998లో ఇక్కడ శివుడి (చంద్రశేఖరుడు) విగ్రహాన్ని తయారు చేయాలని కంచి శంకరమఠం నిర్వాహకులు భావించారు. ఇందుకోసం గాంగేయలూరు చుట్టూ వున్న కొండలను పరిశీలించారు.

దాదాపు వంద కొండలను పరిశీలించిన తరువాత, చివరిగా 'గోపురం కొండ'ను ఎన్నుకున్నారు. ఇక్కడ తయారు చేసే విగ్రహాన్ని చెన్నై-మహాబలిపురం రోడ్డులోని ముత్తుక్కాడులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 22,550 చదరపు అడుగుల వైశాల్యంలో విగ్రహం తయారు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కలైమామణి ముత్తయ్య స్థపతి సారథ్యంలో విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ, శివుని శిలను పెరుమాళ్‌గా మార్చాలని శంకరమఠం నిర్ణయించింది. అప్పటి నుంచి ఆ విగ్రహం తయారీ పనులు జరుగుతున్నాయి. 25 అడుగుల పీఠం ఎత్తుతో కలిపి మొత్తం 120 అడుగుల ఎత్తుతో విగ్రహం తయారవుతోంది. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి. సుమారు వెయ్యి టన్నులు బరువు కలిగిన పెరుమాళ్ విగ్రహాన్ని గాంగేయలూరు నుంచి ముత్తుక్కాడు వరకు తీసుకొచ్చేందుకు మార్గమధ్యంలోని వంతెనలు తట్టుకునేస్థితిలో లేవు.

భారీ విగ్రహం అంత దూరం తీసుకొచ్చే ప్రయత్నంలో దెబ్బతినే అవకాశం కూడా వుందని నిపుణులు హెచ్చరించడంతో నిర్వాహకులు ఆందోళన చెందారు. ఈ కారణంగా విగ్రహం తయారీ పనులు నిలిచిపోయాయి కూడా. అయితే విగ్రహం పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం మంచిది కాదని భావించిన గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీని ఆశ్రయించారు. అప్పట్లో తితిదే పాలకమండలి నుంచి ఎన్.యువరాజ్ నేతృత్వంలోని పలువురు సభ్యులు వచ్చి ఈ పనులను పరిశీలించి, విగ్రహాన్ని పూర్తి చేసేందుకు ముందుకొచ్చారు. అంతేగాక గాంగేయలూరులోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానించారు. ఎట్టకేలకు పనులు ఊపందుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నామలై, పడవేడు, రేణుకామ్మాళ్ వంటి ప్రసిద్ధ ఆలయాలున్న తిరువణ్ణామలై జిల్లాలో పెరుమాళ్ విగ్రహమున్న గాంగేయలూరు కూడా మరో పుణ్యక్షేత్రంగా మారడం ఖాయం.

- ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

Friday, January 14, 2011

Thirumala & Thirupathi , Andhra Pradesh

ONLY LUCKY PEOPLE CAN SEE THIS PICTURE

Sri Devi Bhu Devi Sahitha Venkateswara Swamy

Thirumala Temple View of Ananda Nilayam

Silathoranam  - One of the Ancestral Formation in the World (2 km from Thirumala)

Radhotsavam of Malayappa Swamy (Lord Venkateswara)

Srivari Padamulu (4 km from Thirumala )

Museum on Thirumala

ANANDA NILAYAM, Thirumala

Malayappa Swamy with Sridevi and Bhudevi, Thirumala
Chandragiri Fort Building (10 KM from Thirupathi)
Gali Gopuram of Sri Kalahasti (36 km from Thirupathi)

Brahmotsavam of Sri Venkateswara Swamy, Thirumala



Thirumala

SUPRABHATAM with Explanation


|| 1 ||
"kausalya supraja rama!purva sandhya pravartate, uthishta! narasardula! kartavyam daivam ahnikam "
Sri Rama! Kausalya's endearing son! Wake up, dear! You have to do your day-to-day duties do wake up please.

|| 2 ||
"uthishtothishta! govinda! uthishta garudadhvaja! uthishta kamalakantha! thrilokyam mangalam kuru "
O Govinda, wake up! O Garudadhvaja! Wake up. O Kamalakanta (i.e., the husband of Kamala)! All the three worlds are under your rule, they have to prosper, Wake up, my child.

|| 3 ||
" matas samsastajagatam : madhukaitabhareh vakshoviharini ! manohara-divyamurte : sri swamini srithajana priya danaseele ! sri Venkatesadayithe thava suprabhatham "
May it be an auspicious dawn (morning) to Thee, O Lakshmi, the Mother of the Worlds, the ever dweller on the chest of Vishnu ( i.e., the enemy of the demons, madhu and Kaitabha), of attractive and divine form, the Mistress and of the nature of granting the desired objects of those seeking refuge!

|| 4 ||
"thava suprabhatham aravindalochane ! bhavathu prasanna mukhachandra mandale vidhisankarendra vanithabhirarchithe ! vrishasaila nathadavithel dayanidhe "
May it be an auspicious dawn to Thee, O Lakshmi of the eyes like the lotus, of a bright face like the Moon, worshipped by the wives of Brahma, Shankara and Indra and a treasure of compassion. You have an endearing attachment to your devotees.
 
|| 5 ||
"athriyadhi saptharushays samupasya sandhyam aakasa sindhu kamalani manoharani aadaya padhayuga marchayithum prapanna: seshadrisekhara vibho! thava suprabhatham"
Having worshipped the morning twilight (i.e., having said the morning prayer, namely, the sandhyavandana) the seven sages like Arti, bringing the beautiful lotuses from the Divine Ganges, have arrived to worship Thy feet. Lord of Seshachala! May it be an auspicious dawn to Thee?
 
|| 6 ||
" panchananabja bhava shanmukha vasavadhya: tryvikramadhi charitham vibhudhasthuvanthi bhashapathipatathi vasara shuddhi marath seshadri-sekhara-vibho! thava subrabhatham "
Aran, Aryan, Shanmuga and Devas are all-anxious to adore you. The daily Panchangam is to be read and approved by you. Get up, Srinivasa, dear.

|| 7 ||
" Eeshathprapulla saraseeruha narikela phugadrumadi sumanohara Balikanam aavaathi mandamanilassaha divya gandhai: seshadri-shekhara-vibho! thava suprabhatham"
The breeze, carrying the wonderful fragrance of the partly opened lotuses and the beautiful ears of the trees like the Areca and Coconut, is gently blowing. Lord of Seshachala! May it be an auspicious dawn to Thee.

|| 8 ||
"unmilya nethrayugam uttama-panjarasthaa : Paathraa vasishta kadhaleephala payasani bhukthvaa saleelamatha keli sukha: patanthi Seshadri-sekhara-vibho! thava suprabhatham "
 The parrots, kept for pleasure in the foremost cages, opening their eyes, are graciously singing, after eating the remains of the plantain fruits and the payasam in the vessels. Lord Seshachala! May it be an auspicious dawn to Thee?

|| 9 ||
" thanthreeprakarshamadhuraswanaya vipanchyaa gayathyanantha charitham thava naradopi Bhashasamagrama sakruthkara sara rammyam seshadri-sekhara-vibho! thava suprabhatham "
Thumburu Narada is speeding up to you. His Veena is set to sing your glory. Do hear these melodious songs of Narada.
 
|| 10 ||
"brungavaleecha makaranda rashanuvidda jhankara geetha ninadaissa sevanaya niryathyupaantha sarasee kamalodarebhyaha seshadri-sekhara-vibho! thava suprabhatham"
Lotus hidden bees, having come out in the open with the opening of the petals, are singing solemn hymns. Oh Srinivasa! You are omnipotent.

|| 11 ||
"yosha ganena varadhadni vimathyamaane ghoshalayeshu dhadhimanthana theevraghoshaaha Roshaathkalim vidha-dhathe kakubhascha kumbhaha seshadri-sekhara-vibho! thava suprabhatham"
Ayarpadi, ladies are singing their sweet melodies as they are churning butter. They announce the day-dawn. Get up, oh Govinda! Bless these endearing Gopis.
 
|| 12 ||
"padmeshamithra sathapathra kathalivargha Harthum shriyam kuvalayasya nijanga Lakshmya Bheree ninadamiva bibrathi theevranadam seshadri-sekhara-vibho! thava suprabhatham "
The humming black bees seem to sing that they are far more attractive than the black 'Kuvali' flowers from which they draw honey. All the three of you namely, bees, flowers and Your Holy Self form a holy Trinity in color and splendor.

|| 13 ||
"srimannabheeshta varadhakhila lookabandho sri srinivasa jagadekadayaika sindho sri devathagruha bhujanthara divyamurthe sri Venkatachalapathe! thava suprabhatham "
You have changed your abode from Heaven to Venkatam to give boons to your devotees. Do hurry up! Venkatesha, bless them.
 
|| 14 ||
"sri swamy pushkarinikaplava nirmalangaa sreyorthino hara viranchi sanadadhyaha dware vasanthi varavethra hathothamangaha: Sri Venkatachalapathel ! thava suprabhatham"
Aryan, Aran and Celestials, after taking bath in Swami Pushkarini, are awaiting Your Grace to receive blessings.
 
|| 15 ||
"sri seshasaila garudachala venkatadri narayanadri vrishabhadri vrishadri mukhyam akhyam thvadeeyavasatheranisam vadanthi sri venkatachalapathe ! thava suprabhatham"
Lord of Venkatachala! Thy abode is always called by several names, as Sri Seshasaila, Garudachala, Venkatadri, Narayanadri, Vrsabhadri, Vrsadri. May it be an auspicious dawn to Thee?
 
|| 16 ||
"sevaparah shiva-suresa krusanudharma rakshombhunatha pavamana dhanadhi nathaha: bhaddanjali pravilasannija sirsha desaha: sri venkatachalapathe! thava suprabhatham"
 Siva, Indra, Agni, Yama, Nairuti, Varuna, Vayu and Kubera, with folded hands on their heads, are desirous of offering service to thee. Lord of Venkatachala! May it be an auspicious dawn to Thee?

|| 17 ||
"dhatishu te vihagaraja mrugadhiraja nagadhiraja gajaraja hayadhiraja : swaswadhikara mahimadhika marthayanthe sri venkatachalapathe ! thava suprabhatham"
Garuda, lion, Anata, Gaja, Ashwa, all these five are awaiting Your Command to improve their way of doing things to serve you better and more effectively.

|| 18 ||
"suryendubhouma bhudhavakpathi kavya suri swarbhanukethu divishathparishathpradanaa: twaddhasa dasa charamavadhidaasa daasa: sri venkatachalapathe! thava suprabhatham"
The main (deities) of the Assembly of Gods - the nine planets (Sun, Moon, Mars (Angarakha), Mercury (Buddha), Jupiter (Bruhaspati), Venus (Shukra), Saturn (Shani), Rahu and Ketu) remain happy to be the servants of the last grade servants of the servants of Thy servants ( i.e. They remain most obedient to Thee).

|| 19 ||
"thwathpadadhulibharita spurithothha manga :swargapavarga nirapeksha nijantharanga: kalpagamakalanaya kulatham labhanthe sri venkatachalapathe ! thava suprabhatham"
Surya and the rest of the Navagrahas are steadfast in their dutiful obeisance to your devotees. They await Your Command to serve you through your devotees.

|| 20 ||
"thvadgopuragra sikharani nirikshmana swargapavarga padavim paramam shrayantha:marthyaa manushyabhuvane mathimashrayanthe sri venkatachalapathe ! thava suprabhatham"
Srinivasa! Mankind desires to be with you forever and forever in Venkatam and to serve you life-long.

|| 21 ||
"sri bhuminayaka dayadhi gunamrtabdhe devadhideva ! jagadeka saranya murthe srimann-ananta-garudadibhir arcitanghre! sri venkatachalapathe ! thava suprabhatham"
Lord of Sridevi and Bhudevi! The ocean of nectar of compassion and other virtues! The chief of Gods! The sole refuge of the Universe! The possessor of Sri ( i.e., wealth)! One whose feet are worshipped by Ananta and Garuda!

|| 22 ||
"sri padmanabha purushothama vasudeva vaikuntha madhava janardana chakrapane sri vathsachinha saranagatha parijatha sri venkatachalapathe! thava suprabhatham "
Bakthas are chanting your names as Vasudeva, Madhava, Govinda, Janardhana, Chakrapani and other endearing names. Devotees are ever ready to obey Your Command.

|| 23 ||
" kandarpa darpa hara sundara divya murthe kanthaa kuchamburuha kutmialola drishte kalyana nirmala gunakara divyakeerthe sri venkatachalapathe! thava suprabhatham "
Your beauty enchants Sri Lakshmi. She would not leave her Lord. For the sake of Bakthas get up please and afford them Dharshan.

|| 24 ||
" minakruthe kamatakola nrusimha varnin swamin parashvatha thapodana ramachandra seshamsharama yadhunandana kalki roopa sri venkatachalapathe ! thava suprabhatham "
Thy descent from Paramapada was heralded in Thy numerous avatars when you did immense good to your devotees. Great God, do come to us to help us in our distress.

|| 25 ||
" ela lavanga ghanasaara sugandhi thirtham divyamviyathsarithi hemaghateshu purnam drutwadhya vaidika sikhamanaya: prahrushta: thishtanthi venkatapathe ! thava suprabhatham "
The Brahmins, well versed in the Vedas, are now joyfully waiting (for worshipping you), carrying the golden pots filled with the water of the Divine Ganges (AkashGanga) which (waters) are rendered fragrant by (mixing of) the cardamoms, cloves and camphor. Lord of Venkatachala! May it be an auspicious dawn to Thee?

|| 26 ||
" bhaswanudethi vikachani saroruhani sampoorayanthi ninadai : kakubho vihangha: sri vaishnavassathatha marthitha mangalasthe dhamasrayanthi thava venkata ! subrabhatham "
The twittering of birds on all sides proclaims the dawn of the day. Devotees are gathered in numbers and they sing their vociferous adoration to you.

|| 27 ||
" bhramadayas suravaras samaharshayastthe santhassa nandana mukhastvatha yogivarya: dhamanthike thavahi mangala vasthu hastha: sri venkatachalapathe ! thava suprabhatham "
The Chief of Gods like Brahma, the great sages and the good Yogins as Sanandana are (waiting) at Thy abode, holding auspicious things in their hands. Lord of Venkatachala! May it be an auspicious dawn to Thee.

|| 28 ||
" lakshminivasa niravadya gunaika sindo : samsarasagara samuththaranaika setho vedanta vedya nijavaibhava bhakta bhogya sri venkatachalapathe ! thava suprabhatham "
Abode of Lakshmi! Ocean of faultless (and auspicious) virtues! Bridge to cross the ocean of transmigration (samsara)! One whose glory is known through the Upanishads! One enjoyed by the devotees! Lord of Venkatachala! May it be an auspicious dawn to Thee.